విజయవాడ : మున్సిపాలిటీ పరిధిలో టిడిపి మాజీ కౌన్సిలర్ కృష్ణమూర్తి విజయవాడలో మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో వైసిపి లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి, కృష్ణమూర్తికి వైసిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెడుతున్న పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరామన్నారు. వైసిపి ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ కుమార్ రెడ్డి, వైసిపి రాష్ట్ర నాయకులు సివి కుమార్, మొగసాల కఅష్ణమూర్తి, కుప్పం నియోజకవర్గ నాయకులు సెంథిల్ కుమార్, వైసిపి పట్టణ కన్వీనర్ మండి సుధ, తదితరులు పాల్గొన్నారు.