
వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి రథోత్సవం
నేడు తిరుచానూరు పంచమి
ప్రజాశక్తి - తిరుచానూరు
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం ఉదయం రథోత్సవం కన్నులపండువగా జరిగింది. ఉదయం 8.40 గంటలకు రథోత్సవం మొదలై ఆలయ నాలుగు మాడ వీధుల్లో సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో రథాన్ని లాగారు. మధ్యాహ్నం 12 గంటల నుండి రథమండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. రథోత్సవంలో తిరుమల పెద్ద జీయర్స్వామి, చిన్న జీయర్స్వామి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈవో ఎవి ధర్మా రెడ్డి, జేఈవో వీర బ్రహ్మం, సిఈ నాగేశ్వరరావు, ఎస్ ఈ-3 సత్యనారాయణ పాల్గొన్నారు.
నేడు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపు
శనివారం పంచమి నేపథ్యంలో తిరుచానూరు వైపు వెళ్లే వాహనాల ట్రాఫిక్ మళ్లింపు ఆంక్షలు అమల్లో ఉంటాయని ఎస్పి పరమేశ్వర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం రాత్రి 12 గంటల నుంచి సింధు కూడలి నుంచి తిరుచానూరు లోపలికి ఎటువంటి వాహనాలు అనుమతి లేదు. పూడి, జడ్పి హైస్కూల్, నవజీవన్ హోల్డింగ్ పాయింట్ నుంచి క్యూలైన్ల ద్వారా నాలుగో గేటు నుంచి మాత్రమే పుష్కరిణి లోనికి ప్రవేశం ఉంటుంది. తిరుచానూరు ప్రజలు గ్రామంలో ఎలాంటి వాహనాలపై తిరగకుండా పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి. భక్తులు విలువైన ఆభరణాలు ధరించి రాకూడదు. వస్తువులు, సెల్ఫోన్లు జాగ్రత్తగా ఉంచుకోవాలి.
అలరించిన శాస్త్రీయ నృత్యాలు
ప్రజాశక్తి- తిరుపతి సిటీ
సురభి అకాడమీ ఆఫ్ పర్ఫామెన్స్ డైరెక్టర్ డాక్టర్ సురభి లక్ష్మి శారద ఆధ్వర్యంలో వారి బందంచే ఏర్పాటు చేసిన శాస్త్రీయ నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టులు, ఎస్ వి సంగీత నత్య కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక మహతి ఆడిటోరియంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం విదితమే.. అందులో భాగంగా హైదరాబాద్కు చెందిన డాక్టర్ సురభి లక్ష్మీ శారద బందం ఏర్పాటు చేసిన శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. డాక్టర్ సురభి లక్ష్మి శారద ప్రదర్శించిన కులుకగా నడవరో కుమ్మలాల ఒక పని ఒక పని వయ్యారమై అన్న అన్నమయ్య కీర్తనలు రమ్యంగా నత్తించి ప్రేక్షకుల మన్ననలను అందుకున్నారు. భరతనాట్య కూచిపూడి నత్యాలు సుస్మిత, సుశ్రుత, హిమ రితిక. భరణి, ఐశ్వర్య, చరిత, రాగసుధ, పూర్ణ జోషిత, పూజిత, మోక్షిత పావని చాలా చక్కగా అభినయించారు. ఈ సందర్భంగా కళాకారులను పలువురు అభినందించారు.
అశ్వ వాహన సేవలో టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి, చంద్రగిరి ఎంఎల్ఎ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి