
ఉత్కలపీఠం సిల్వర్ జూబ్లీ వేడుకలకు రాష్ట్రపతికి ఆహ్వానం
ప్రజాశక్తి - క్యాంపస్ : తిరుపతిలోని జాతీయ సంస్కత విశ్వవిద్యాలయంలో జరగనున్న ఉత్కలపీఠం (ఒడిశా చైర్) సిల్వర్ జూబ్లీ వేడుకలకు విశిష్ట అతిథిగా హాజరు కావాలని రాష్ట్రపతి, జాతీయ సంస్కత విశ్వవిద్యాలయం విజిటర్ ద్రౌపదిముర్ముని రాష్ట్రపతి భవన్లో కలిసి వైస్-చాన్సలర్ ప్రొఫెసర్ జి.యస్.ఆర్ కృష్ణమూర్తి ఆహ్వానం అందిం చా రు. తిరుపతిలోని జాతీయ సంస్కత విశ్వ విద్యాలయంలో త్వరలోనే జరుగుబోయే ఉత్కలపీఠం (ఒడిశా చైర్) సిల్వర్ జూబ్లీ వేడుకలకు విశిష్టాతిథిగా రావలసినదిగా రాష్ట్రపతి, జాతీయ సంస్కత విశ్వ విద్యాలయం విజిటర్ (సందర్శకురాలు) అయిన ద్రౌపది ముర్ముని జాతీయ సంస్కత విశ్వ విద్యాలయం వైస్-చాన్సలర్ ప్రొ.జి. యస్. ఆర్ క్రిష్ణమూర్తి , న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఆహ్వానించారు. జాతీయ సంస్కత విశ్వ విద్యాలయంలో ఉత్కలపీఠం స్థాపించి 25 సంవత్సరాలు పూర్త వుతున్న శుభసం దర్భంగా త్వరలోనే విశ్వ విద్యా లయంలో సిల్వర్ జూబ్లీ వేడుక లను నిర్వ హించను న్నారు. ఈ సంద ర్భంగా వైస్-చాన్సలర్ ప్రొ.జి. యస్.ఆర్ కృష్ణ మూర్తి, ఉత్కలపీఠం డైరెక్టర్ డా.జ్ఞాన రంజన్ పండాతో కలిసి, ద్రౌపదిముర్ముకి స్మతిచిహ్న మందించి, సత్కరించి, ఈ వేడుకలకు విశిష్ట అతిథిగా రావాలని ఆహ్వానించారు. ఉత్కల పీఠం సిల్వర్ జూబ్లీ కార్యక్రమాలలో పాలు పంచు కుంటానని రాష్ట్రపతి తెలిపారు. విద్యా పీఠం డైమండ్ జూబ్లీకి కూడా రావడానికి ప్రయత్నిస్తానని చెప్పా రన్నారు. తిరుపతి సంస్కత విద్యాపీఠం మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, ప్రభుత్వం కలిసి చాలా కార్యక్రమాలు చేయడం విన్నాను అని చెప్పి, విద్యాపీఠం విసికి అభినందనలు తెలిపారు.