Nov 15,2023 00:04

బిఎస్‌ఎన్‌ఎల్‌ ఏపీ టెలికాం సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 4జి టవర్లు ఏర్పాటు


బిఎస్‌ఎన్‌ఎల్‌ ఏపీ టెలికాం సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌
ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌
బిఎస్‌ఎన్‌ఎల్‌ స్వదేశీ 4జి నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఏపీ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎం.శేషాచలం తెలిపారు. మంగళవారం తిరుపతి జిల్లా బిఎస్‌ఎన్‌ఎల్‌ జనరల్‌ మేనేజర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బిఎస్‌ఎన్‌ఎల్‌ అభ్యున్నతికి చర్యలు తీసుకున్నమని, ఫ్యాన్‌ ఇండియా ప్రాతిపదికన అనేక ప్రాజెక్టులు చేపడుతున్నట్లు వెల్లడించారు. బిఎస్‌ఎన్‌ఎల్‌ పనిచేసే ఉద్యోగులు అనేకమంది విఆర్‌ఎస్‌ తీసుకోవడం వల్ల కొంత వరకు లాభాల్లో నడుస్తా ఉందని చెప్పారు. 4జీ సేవలను మారుమూల ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయడానికి కషి చేస్తున్నట్టు వెల్లడించారు. బిఎస్‌ఎన్‌ఎల్‌ ఆదాయం రూ.1900కోట్లు డాటా అని, గత ఆర్థిక సంవత్సరం కంటే 14వ శాతం ఎక్కువ అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ సర్కిల్లో రూ.700 కోట్ల ఆదాయం కలిగి ఉందని వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరం కంటే పది శాతం ఎక్కువ అని, ఉమ్మడి చిత్తూరు 4జి టవర్లను విస్తతంగా ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. వచ్చే ఏడాదికంతా 4జి టవర్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. బిఎస్‌ఎన్‌ఎల్‌ ఏపీ సర్కిల్లో 4300 సెట్లలో 4జీ పరికరాలు ప్రారంభించాయని చెప్పారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 441 టవర్‌లో 43 పూర్తి చేశామని తెలిపారు. సముద్రమార్గంలో ఆయన తమిళనాడు నుంచి అండమాన్‌ నికోబార్‌ ఏడు దీవుల్లో కూడా కేబుల్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. దీంతోపాటు కొచ్చి లక్ష దీపు సముద్ర మార్గంలో కేబుల్‌ వేయడం జరిగిందని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. సమావేశంలో తిరుపతి జిల్లా బిఎస్‌ఎన్‌ఎల్‌ జనరల్‌ మేనేజర్‌ అమరేంద్రర్‌ రెడ్డి, బిఎస్‌ఎన్‌ఎల్‌ వెంకోబర్‌ రావు పాల్గొన్నారు.