
ప్రజాశక్తి-పెద్దాపురం
అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యంలో జరిగే ఉద్యమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం.రాజశేఖర్ పిలుపునిచ్చారు. సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజారక్షణభేరి యాత్ర గురువారం మండల పరిధిలోని ఆర్బి.కొత్తూరు, ఆర్బి.పట్నం, చిన్న బ్రహ్మదేవం, కొండపల్లి, కె.కొత్తూరు, ఆనూరు, ఆనూరు కొత్తూరు, వాలుతిమ్మాపురం, జె.తిమ్మాపురం, కట్టమూరు గ్రామాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ నవంబర్ 15 న జరిగే చలో విజయవాడను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు బిజెపికి ఊడిగం చేస్తున్నాయన్నారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన బిజెపికి వంత పాడుతున్నాయన్నారు. పోరాటాల ద్వారానే రాష్ట్ర హక్కులను సాధించుకుంటామన్నారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి నీలపాల సూరిబాబు, సిరపరపు శ్రీనివాస్, కేదారి నాగు, డి.కష్ణ, డి.సత్యనారాయణ, గరగపాటి పెంటయ్య, గడిగట్ల సత్తిబాబు, దారపురెడ్డి క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.