Nov 21,2023 22:47

తిరుపతిలో దొంగ ఓట్లు తొలగించండి: రజనీకాంత్‌

తిరుపతిలో దొంగ ఓట్లు తొలగించండి: రజనీకాంత్‌
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): తిరుపతిలో అన్ని డివిజన్లో పరిధిలో దొంగ ఓట్లు, షిఫ్టింగ్‌ ఓటర్లు, మృతుల ఓట్లు, ఆబ్సెంట్‌ ఓటర్లు గుర్తించి బిఎల్‌ఓ, బిఎల్‌ ఎ లకు ఆధా రాలతో అందించిన ఇప్పటి వరకు ఆయా ఓటర్లను జాబితా నుండి తొల గించలేదని తెలుగు యువత అధికార ప్రతినిధి కంకణాల రజనీకాంత్‌ నాయుడు వాపోయారు. ఈ మేరకు తిరుపతి ఎన్నికల అధికారి హరితకు మంగళవారం వినతి పత్రం అందించారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గి ఓటు హక్కును అపహాస్యం పాలు కాకుండా దొంగ ఓట్లను, డెత్‌ ఓట్లను, షిఫ్టింగ్‌ ఓట్లను, ఆబ్సెంట్‌ ఓట్లను తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నగర అధ్యక్షుడు వట్టికుంట శంకరనారాయణ, 26, 27, 46 డివిజన్‌ టిడిపి అధ్యక్షులు శ్రీనివాస యాదవ్‌, సుధాకర్‌ రెడ్డి, నాగ ప్రతాప్‌, రామచంద్ర రెడ్డి పాల్గొన్నారు.