Nov 22,2023 08:18

న్యూఢిల్లీ   :  రైతులను ఎందుకు విలన్లుగా చిత్రీకరిస్తున్నారని సుప్రీంకోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. పంట వ్యర్థాల దగ్థం అంశం పరిశీలనలో ఉందని పేర్కొంటూ... పంజాబ్‌ రైతులకు మద్దతు ప్రకటించింది. శీతాకాలంలో పంట వ్యర్థాల దగ్ధంతో ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రమౌతోందంటూ దాఖలైన పిటిషన్‌లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. పంట వ్యర్థాలను తగులబెట్టకుండా రైతులకు కొన్ని ప్రోత్సాహకాలు అందించాలని సూచించింది. రైతులకు ఇచ్చే ప్రోత్సాహకాల గురించి హర్యానా ప్రభుత్వం నుండి నేర్చుకోవాలని పంజాబ్‌ ప్రభుత్వానికి సూచించింది.