Nov 21,2023 00:35

శ్రీవారి భక్తులను మోసం చేసిన వ్యక్తి అరెస్టు

శ్రీవారి భక్తులను మోసం చేసిన వ్యక్తి అరెస్టు
ప్రజాశక్తి- తిరుమల: వకీల్‌ నే మోసం చేసిన మారుతీ అనే వ్యక్తిని తిరుమల పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. సోమవారం మధ్యాహ్నం రెండు వేరు వేరు ఘటనలో అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. శ్రీవారి బ్రేక్‌ దర్శనాలు, వస్త్రం సేవా టిక్కెట్లు ఇప్పిస్తానని మోసం చేసినట్టు తెలిపారు. లైఫ్‌ టైమ్‌ డోనార్‌ టికెట్లు తీయిస్తానని బళ్లారికి చెందిన అడ్వకేట్‌ వద్ద రూ.28 లక్షలు, శ్రీవాణి బ్రేక్‌ దర్శనం టిక్కెట్లు తీసిస్తానని మరో భక్తుడిని రూ.42వేలు మోసం చేసాడని తెలిపారు. నిందితుడు కర్ణాటక కు చెందిన ఎమ్మెల్యే, పాలక మండలి సభ్యుడి దగ్గర పిఆర్వోగా ఉన్నట్టు పోలీసు విచారణలో తేలింది. ఎమ్మెల్యేగా చెలామణి అవుతూ గతంలోనూ పలువురిని మోసగించాడని, దీపిపై లోతైన విచారణ చేపడుతున్నామని, ఎమ్మెల్యే ఫిర్యాదుతో కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.