న్యూఢిల్లీ : భారత్, శ్రీలంక మధ్య తొలి టీ 20లో ఆసక్తికరమైన ఘటన ఒకటి జరిగింది. ఈ మ్యాచ్లో ప్రతిభ కనబర్చిన శ్రీలంక ఆల్ రౌండర్ చమీకా కరుణ రత్నేకు టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్థిక్ ప్యాండ ప్రత్యేక బహుమతినినిచ్చారు. చమీకా కరుణరత్నె ఈ ఫార్మాట్తోనే అరంగేట్రం చేశాడు. తన ఆరాధ్య క్రికెటర్ నుండి గిఫ్ట్ను అందుకున్న రత్నే ఉబ్బితబ్బిబయ్యాడు. హార్థిక్ బహుమతిగా తన బ్యాట్ను అందించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన వీడియోను రత్నే తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. 'నా టీ20 అరంగేట్రంలో నా రోల్మోడల్ హార్దిక్ పాండ్య చేతుల మీదుగా బ్యాట్ అందుకున్నందుకు గర్వపడుతున్నాను. హార్థిక్్ అద్భుతమైన వ్యక్తి. నేను ఈ రోజును ఎప్పటికీ మార్చిపోలేను' అని రాసుకొచ్చాడు. భారత క్రికెటర్..ఇతర దేశానికి చెందిన క్రికెటర్ పట్ల చూపిన క్రీడాస్ఫూర్తిని చూసి జట్టు సహచరులతోపాటు పాండ్య అభిమానులు ఆయన్ని అభినందిస్తున్నారు. హార్థిక్ సోదరుడు, భారత క్రికెటర్ కఅనాల్ పాండ్యకు కొవిడ్ పాజిటివ్గా తేలడంతో మంగళవారం జరగాల్సిన టీ 20 మ్యాచ్ను బుధవారానికి వాయిదా వేశారు.