రెడ్డిగూడెం (ఎన్టిఆర్జిల్లా) : మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మూడు ధరఖాస్తు లు వచ్చినట్లు ఇన్చార్జి ఎంపిడిఓ పి శంకరరావు తెలిపారు. ఈ మూడు ధరఖాస్తులను సంబంధిత అధికారులకు పంపించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన 11 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.










