రికార్డులను పరిశీలిస్తున్న అధికారిణి
రికార్డులను పరిశీలిస్తున్న అధికారిణి
సొసైటీ కార్యాలయంలో డీసీఓ తనిఖీ
కొడవలూరు :మండలంలోని యల్లాయపాలెం సహకార సంఘం కార్యాలయాన్ని జిల్లా సహకారాధికారిణి బీ.సుధాభారతి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల నిల్వలు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. అనంతరం స్థానిక సచివాలయాన్ని పరిశీలించి సచివాలయం ద్వారా అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీసీఓ మాట్లాడుతూ రైతులకు సహకార సంఘాలు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. సకాలంలో ఎరువులు అందించడంతోపాటు అవసరాలకు రుణ సదుపాయం కల్పించి ఆసరాగా నిలవాలని సూచించారు. ఆమె వెంట ఎన్డీఎల్సీఓ ఎంవి.సుభాషిణి, కోవూరు సీనియర్ ఇన్స్పెక్టర్ పి.శివకుమార్, విజయ డెయిరీ డైరెక్టర్ ఇసనాక ఆర్ సునీల్ రెడ్డిలు ఉన్నారు.










