Nov 19,2023 21:16

ప్రజాశక్తి-కాకినాడ రూరల్‌ ప్లాస్టిక్‌ వ్యర్థాలను నివారించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడం సాధ్యపడుతుందని సేవ్‌ ద పీపుల్‌ ఆర్గనైజేషన్‌ అధ్యక్షుడు సుంకర సుధీర్‌ అన్నారు. ఆదివారం కాకినాడ ఎన్టీఆర్‌ బీచ్‌లో బీచ్‌ క్లీనింగ్‌ కార్యక్రమాన్ని ఆ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతినెలా ఆర్గనైజేషన్‌ చేసే కార్యక్రమంలో భాగంగా బీచ్‌ క్లీనింగ్‌ ప్రోగ్రాం ఏర్పాటు చేసి, ముఖ్యంగా యువతను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. కాకినాడ బీచ్‌లో సుమారు టన్ను ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 30 మంది పాల్గొన్నారు.