Sep 26,2023 20:57

సిఎంతో మాట్లాడుతున్న ఎంఎల్‌సి తూమాటి మాధవరావు

ప్రజాశక్తి-కందుకూరు :శాసన మండలి సమావేశాల సందర్భంగా మంగళవారం ఎంఎల్‌సి తూమాటి మాధవ రావు సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని కలిసి ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలోని చెరుకూరు మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంక్‌ పునరుద్ధరణ కోసం సుమారు రూ.50 లక్షల నిధులు మంజూరు చేయించారు. సిఎం సహాయ నిధి కింద కొన్ని మెడికల్‌ బిల్స్‌ ను ముఖ్యమంత్రి ద్వారా ఆమోదింపజేశారు.