Dec 29,2020 18:02

.విజయనగరం టౌన్‌(విజయనగరం): 33రొజులుగా ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు మంగళవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స వద్ద నిరసన దీక్ష చేపట్టారు. మోడీ చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతుల పోరాటానికి మద్దతు కిసాన్‌ సంఘర్షణ కో-ఆర్డినేషన్‌ చేస్తున్న నిరసన దీక్షలు 5 రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.రమణమ్మ, వి.లక్ష్మీ మాట్లాడుతూ 33 రోజులుగా రైతులు వ్యవసాయ చట్టాలు రద్దు చెయ్యాలని పొట్లాడుతుంటే మోడీగారి కంటికి కనబడటం లేదా అని విమర్శించారు. దేశానికి అన్న0 పెట్టే రైతులను, వారి పోరాటాన్ని ఉగ్రవాదులు గా ,దేశద్రోహులు పోరాటంగా, ఎవరో రెచ్చగొడితే చేస్తున్న పోరాటంగా తప్పుడు ప్రచారం చేయడం చిగ్గుచేటన్నరు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అలమండ ఆనంద్‌, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అరసాడ మణికంఠ, ఐద్వా జిల్లా నాయకులు ఎం.జగదాంబ, ఆర్‌.కఅష్ణ వేణి, తదితరులు పాల్గొన్నారు.