రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన క్రీడాకారులు
అగళి : ఆగళి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అండర్- 14 సాఫ్ట్ బాల్, బేస్బాల్ క్రీడావిభాగంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయినట్లు ఆపాఠశాల హెచ్ఎం గురుసిద్ధమూర్తి తెలిపారు. 8వ తరగతి చదువుతున్న కీర్తన, భూతేష్, బిందు సాఫ్ట్బాల్, ఆదినారాయణ బేస్బాల్ విభాగంలో రాష్ట్రస్థాయికి ఎంపికైనట్టు పిడి సంజీవరాయుడు తెలిపారు..










