Dec 28,2022 21:20

రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికైన విద్యార్థులతో అధ్యాపకులు

        ప్రజాశక్తి-ధర్మవరం టౌన్‌   ఎన్బీఎఫ్‌ ఆధ్వర్యంలో జరిగే వివిధ క్రీడల్లో తమ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు ప్రభుత్వ బాలుర ఉన్నతపాఠశాల హెచ్‌ఎం శైలజ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు బేస్‌బాల్‌ అండర్‌-14 బాలుర విభాగంలో పార్థసారధి కాకినాడలో జరిగే పోటీల్లో, నెట్‌బాల్‌ అండర్‌-14 బాలుర విభాగంలో కార్తిక్‌నాయక్‌ నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగే పోటీల్లో, బాల్‌ బాడ్మింటన్‌ అండర్‌ -17 బాలుర విభాగంలో పవనకుమార్‌ మదనపల్లిలోజరిగే పోటీలలో, అండర్‌ -14 విభాగంలో చిరంజీవి, మహేష్‌, పొద్దుటూరులో జరిగే రాష్ట్రస్థాయి క్రీడాపోటీల్లో పాల్గొంటారన్నారు. ఈమేరకు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్తులను పీడీలు నవీన్‌ కుమార్‌, నాగేంద్ర, ఉపాధ్యాయులు హేమలత, తులసీ, శంకరనారాయణ, శ్రీనివాసులు, ప్రసాద్‌బాబు, రామక్రిష్ణ, వి.శ్రీనివాసులు నాగరాజు, లీలావతి అభినందించారు.