Jul 19,2021 13:45

న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్ట్‌పై రాజ్యసభలో వైసిపి ఎంపిలు ఆందోళన చేపట్టారు. ప్రాజెక్ట్‌ సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని నినాదాలు చేశారు ఎంపి. విజరుసాయి రెడ్డి వెల్‌లోకి దూసుకెళ్లారు. పోలవరం ప్రాజెక్ట్‌ సవరించిన అంచనాలపై కేంద్రం ఆమోదం తెలపాలని వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. అలాగే వచ్చే ఏడాది కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమైన నిధలు ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు.