పుత్తూరులో ట్రాఫిక్ కష్టాలు..! - నియంత్రణలో అధికారులు విఫలం - ప్రజలకు తప్పని కష్టాలు

పుత్తూరులో ట్రాఫిక్ కష్టాలు..!
- నియంత్రణలో అధికారులు విఫలం
- ప్రజలకు తప్పని కష్టాలు
ప్రజాశక్తి - పుత్తూరు టౌన్: పుత్తూరు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రించడంలో సంబంధిత అధికారులు విఫలమయ్యారని ప్రజలు వాపోతున్నారు. ట్రాఫిక్ కష్టాలు పరిష్కారం అయ్యేది ఎన్నడు?' అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. సంబంధిత అధికారులు మాత్రం చూసీ చూడనట్లు, వ్యవహరిస్తున్నారు. దీంతో ఇటు ప్రజలు, అటు వాహన దారులకు తీవ్ర ఇబ్బందికరంగా మారుతోంది. ఎన్జీవో కాలనీ డివైడర్ వద్ద సూచిక బోర్డు లేని కారణంగా, రెండు రోజులు ముందు రెప్పపాటు కాలంలో ప్రమాదం తప్పింది. ఆంజనేయులు గుడి స్వామి వద్ద డివైడర్ వద్ద సూచిక బోర్డు లేని కారణంగా రాత్రి వేళలో రోడ్డుపై ఆవులు రావడంతో, వీధిలైట్లు వెలగని కారణంగా, ద్విచక్ర వాహన దారుడు ఆవుకి ఢకొీట్టడంతో బోర్లాపడ్డాడు. సంబంధిత అధికారులు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించి కఠిన చర్యలు తీసుకోవాల్సి వుంది. పరిమితికి మించి ఆటోలో జనాభా ఎక్కించడం, విచ్చలవిడిగా ఆటోలు నడపడం, అరికట్టాలని ప్రజలు వాపోతున్నారు.