Nov 10,2023 20:22

శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని అన్నమయ్య సర్కిల్‌ నుంచి గోనెగండ్ల బైపాస్‌ రోడ్డు వరకు సెంటర్‌ లైటింగ్‌ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టణాన్ని ఒక ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని, పట్టణ అభివృద్ధి వైసిపితోనే సాధ్యమని తెలిపారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ రఘు, వైస్‌ ఛైర్మన్‌ నజీర్‌ అహ్మద్‌, మున్సిపల్‌ కమిషనర్‌ గంగిరెడ్డి పాల్గొన్నారు.