
శ్రీ పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ
అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
ప్రజశక్తి- తిరుచానూరు: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి దంపతులకు ఆలయ డెప్యూటీ ఈవో గోవిందరాజన్, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తుమ్మలగుంట శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం నుండి అనేక సంవత్సరాలుగా అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో గజవాహన సేవనాడు పట్టువస్త్రాలు సమర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశం కలగడం తన పూర్వజన్మ సుకతంగా భావిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో విజీవో బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.