Nov 13,2023 22:45

పంచాయతీ కార్మికుల జీతాలు చెల్లిస్తాం: సర్పంచ్‌

పంచాయతీ కార్మికుల జీతాలు చెల్లిస్తాం: సర్పంచ్‌
ప్రజాశక్తి- రేణిగుంట : రేణిగుంట గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలను రెండు రోజుల్లో చెల్లిస్తామని గ్రామ పంచాయతీ సర్పంచ్‌ నగేషం స్పష్టం చేశారు. పంచాయతీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గ్రామ పంచాయతీ సర్పంచ్‌ నగేషం మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల అక్టోబర్‌ నెల జీతం మరో రెండు రోజుల్లో వారి ఖాతాల్లో జమవుతుందని తెలిపారు. కార్మికులకు అక్టోబర్‌ నెల జీతం ఆలస్యం కావడంతో నిరసన తెలుపడం బాధగా ఉందన్నారు. పంచాయతీ పాలనలో కార్మికుల పాత్ర కీలకమన్నారు. కార్మికులు ఇబ్బందులు పడకుండా ప్రతి నెల 5వ తేదీ జీతం వచ్చేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యాంకు వరస సెలవులు వల్ల ఈనెల జీతం ఆలస్యం అయిందని తెలిపారు. పంచాయతీ నుంచి నగదు బ్యాంకుల్లో జమ చేశామని మంగళవారం లోపు కార్మికులు జీతాలు వారికి అందుతాయన్నారు. కార్మికులు ప్రజలకు ఇబ్బంది కలగకుండా పారిశుద్ధ్య లోపం లేకుండా విధులు నిర్వహించాలని కోరారు. కొందరు వ్యక్తిగత స్వలాభం వల్ల పంచాయతీలో సమస్యలు సష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని సమస్యలు సష్టించినా ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ఆదేశాల మేరకు మండల ఇనన్‌చార్జి పవిత్రమ్మ సూచనలతో ముందుకెళుతున్నామన్నారు. రేణిగుంట గ్రామ పంచాయతీ ప్రజలకు పంచాయతీ కార్మికులకు సిబ్బందికి సచివాలయ సిబ్బందికి, వార్డు వాలంటీర్లకు సర్పంచ్‌ నగేషం దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.