
ప్రజాశక్తి-యంత్రాంగం
జిల్లాలో పలుచోట్ల వై ఎపి నీడ్స్ జగన్ కార్యక్రమం గురువారం జరిగింది. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొని సిఎం జగన్ ఎపికి నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధిని వివరించారు. వివరాలు ఇవి..
కాకినాడ నవరత్న పథకాలు ద్వారా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసిన సిఎం వైఎస్ జగన్ మరోసారి అధికారంలోకి వస్తేనే పేద ప్రజలు సుఖసంతోషాలతో ఉండగలరని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. స్థానిక జగన్నాథపురం 18ఎ సచివాలయ పరిధిలోని తూరంగిపేటలో గురువారం రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఎంఎల్ఎ ద్వారంపూడి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డివిజన్ పరిధిలో అమలు చేసిన సంక్షేమ పథకాల లబ్థికి సంబంధించిన ప్రచార బోర్డును ఎంఎల్ఎ ద్వారంపూడి, ఎంఎల్సి కర్రి పద్మశ్రీ, నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగనరసింహారావు, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు ఆవిష్కరించారు.కార్యక్రమంలో కౌడ మాజీ ఛైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, వైసిపి నగరాధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, ఎఎంసి ఛైర్పర్సన్ పసుపులేటి వెంకటలక్ష్మి, నగరపాలక సంస్థ కార్యదర్శి ఎం.ఏసుబాబు, డిప్యూటీ కమిషనర్ కోన శ్రీనివాస్, టిపిఆర్ఒ మానే కష్ణమోహన్, స్థానిక నాయకులు ధోని చిట్టిబాబు, తదితరులు హాజరయ్యారు. రౌతులపూడి ఎపి అభివృద్ధి సిఎం జగన్తో సాధ్యమని మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ జి.రమణమ్మ, జెడ్పిటిసి సభ్యుడు గొల్లు లక్ష్మణమూర్తి అన్నారు. వై ఎపి నీడ్స్ జగన్ అనే కార్యక్రమంలో భాగంగా మండల గ్రామమైన ఎస్.అగ్రహారంలో గురువారం పర్యటించారు గ్రామంలోని పలు నివాసాలకు వెళ్లి నాలుగున్నర సంవత్సరంలో వైసిపి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు జిగిరెడ్డి శ్రీను, సర్పంచ్ సర్ణం శ్రీనివాస్, ఎంపిటిసి కొల్లు పల్లయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు. సామర్లకోట రూరల్ అభివద్ధి,సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు మళ్ళీ జగనే రావాలి అని సామర్లకోట ఎం.పి.పి బొబ్బరాడ సత్తిబాబు, మున్సిపల్ చైర్ పర్సన్ గంగిరెడ్డి అరుణా కష్ణమూర్తి తదితర వక్తలు పేర్కొన్నారు. వై ఎపి నీడ్స్ జగన్ కార్యక్రమాలను గురువారం సామర్లకోట మండలం నవర గ్రామ సచివాలయం నందు, సామర్లకోట బ్రౌన్ పేట సచివాలయం వద్ద కార్యక్రమాలు నిర్వహించారు. సామర్లకోట ఎంపిపి బొబ్బరాడ సత్తిబాబు, మున్సిపల్ చైర్ పర్సన్ గంగిరెడ్డి అరుణ పాల్గొని సిఎం జగన్ అమలుచేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో లో ఎంపిడిఒ డి.శ్రీలలిత, పలువురు ప్రజాప్రతినిథులు, వైసిపి నేతుల తదితరులు పాల్గొన్నారు. కరప మండలం అరట్లకట్ట గ్రామపంచాయతీలో సర్పంచ్ గోపి సత్యవేణి అధ్యక్షతన జరిగిన వై ఎపినీడ్స్ జగన్ కార్యక్రమానికి మండల అధ్యక్షురాలు పెంకె శ్రీలక్ష్మి సత్తిబాబు, జెడ్పిటిసి సభ్యుడు వై.సుబ్బారావు పాల్గొని డిస్ప్లే బోర్డులను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ రాబోయే 7 రోజుల పాటు ప్రతి వాలంటీర్ తన క్లస్టర్ పరిధిలో ప్రతిరోజూ 10 కుటుంబాలను కలిసి ప్రభుత్వం ఇచ్చిన 'ఆంధ్ర ప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే' అనే బుక్ లెట్ అందజేయాలని అన్నారు. పంచాయతీ విస్తరణ అధికారి సలాది శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి వి సునీల్ కుమార్, మండల కన్వీనర్ కాదా వెంకటేశ్వరరావు, అరట్లగట్ట గ్రామ అధ్యక్షుడు చోడగం సూరిబాబు, గొడ్డటిపాలెం గ్రామ సర్పంచ్ వి శ్రీనుబాబు, తదితరులు పాల్గొన్నారు. తాళ్లరేవు మండలం ఇంజరం పంచాయతీ పరిధిలోనీ లబ్ధిదారులకు ప్రత్యక్ష బదిలీ ద్వారా రూ. 21,8, 59, 310లు లబ్ధి చేకూరిందని ఎంపిపి రాయుడు సునీత గంగాధర్ అన్నారు. ఇంజరం సర్పంచ్ ముద్ధన శివరామ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో ప్రభుత్వ పథకాలను ఎంపిడిఒ ఎం.అనుపమ చదివి వినిపించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. మధ్య దళారులు లేకుండా అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా లబ్ధిదారుల అకౌంటు లోకి నగదు బదిలీ చేశారని, అధికారంలోకి వచ్చిన మరుక్షణమే హామీలను అమలు చేసినందుకు జగనన్నను మళ్లీ సిఎం చేయాలని ముమ్మిడివరం ఎఎంసి. ఛైర్మన్ కుడుపూడి శివనారాయణ అన్నారు. అనంతరం వైసిపి జెండాను గ్రామంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల వైసిపి అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్, సచివాలయాల కన్వీనర్ దున్న శ్రీకాంత్, పెయ్యల కొండబాబు, కోరుకొండ చంటి, వైస్ ఎంపిపి ధూళి పూడి నాగేంద్ర ప్రసాద్, కె.నాగరాజు, వ్యవసాయ శాఖ రిటైర్డ్ జెడి పెట్ల సూర్యనారాయణ రాజు, ఉప సర్పంచ్ కోరుకొండ అప్పారావు, దవులూరి శ్రీరామ్మూరి తదితరులు పాల్గొన్నారు..