ఫొటో : ప్రజలతో ప్రతిజ్ఞ చేయిస్తున్న సిబ్బంది
ప్లాస్టిక్ నివారణపై అవగాహణ
ప్రజాశక్తి-మర్రిపాడు : జిల్లా ఫారెస్ట్ అధికారి ఆదేశాల మేరకు మిషన్ లైఫ్లో భాగంగా స్థానిక గ్రామ సచివాలయంలో ప్లాస్టిక్ వాడకంపై అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ అధికారి రవీంద్రబాబు ప్రజలకు అవగాహన కల్పించి, వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజువారీ దినచర్యల్లో భాగంగా ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని సూచించారు. ఇంధనం వాడకాన్ని తగ్గించి, ఎలక్ట్రానిక్ వాహనాలను ఉపయోగిస్తూ పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించాలన్నారు. ఇళ్లలో వాడే విద్యుత్ను ఆదా చేయాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి రామ్మోహన్, ఉపసర్పంచ్ చెన్నపనాయుడు, పంచాయతీ కార్యదర్శి సికిందర్, ఎఫ్బిఒ మల్లికార్జున, సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.










