సమావేశంలో మాట్లాడుతున్న తహశీల్దార్ లక్ష్మీనారాయణ
ప్రజాశక్తి - చిప్పగిరి
మండలంలో పని చేస్తున్న బూత్ లెవెల్ అధికారులందరూ ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలని తహశీల్దార్ లక్ష్మీనారాయణ సూచించారు. శుక్రవారం తహశీల్దార్ కార్యాలయంలో బిఎల్ఒలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ఉన్న సచివాలయ అధికారులతో కలిసి ప్రజలకు ఓటు నమోదుపై అవగాహన కల్పించాలన్నారు. ఫారం 6, 7, 8 ద్వారా కూడా ప్రజలకు తెలియజేయాలన్నారు. జాబితాలో ఎట్టి పరిస్థితుల్లో డెత్ ఫొటోలు, డబుల్ ఫొటోలు లేకుండా చూసుకోవాలని తెలిపారు. ఏదైనా సమస్య వస్తే తమకు తెలియజేయాలని కోరారు. సీనియర్ అసిస్టెంట్ మధు స్వామి పాల్గొన్నారు.