ఫొటో : ప్రచారం నిర్వహిస్తున్న ప్రజా సంఘాల నాయకులు
పిడిఎఫ్ అభ్యర్థుల గెలుపునకు ప్రచారం
ప్రజాశక్తి-కావలి : స్థానిక బుడంగుంట ఎస్సి కాలనీ, ఇందిరమ్మ కాలనీలో ఆదివారం పి.డి.ఎఫ్. ఎంఎల్సి అభ్యర్థుల గెలుపునకు ప్రజాసంఘాల నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు ఓటర్లను కలిసి పిడిఎఫ్ తరుఫున పట్టభద్రుల ఎంఎల్సిగా పోటీ చేస్తున్న మీగడ వెంకటేశ్వరరెడ్డికి మీ మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. అలాగే ఉపాధ్యాయ ఎంఎల్సిగా పోటీ చేస్తున్న పొక్కిరెడ్డి బాబురెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పసుపులేటి పెంచలయ్య, బి.కృష్ణయ్య, కె చెన్నయ్య, డి.వై.ఎఫ్.ఐ నాయకులు పి.కోటేశ్వరరావు, ఎస్.ఎఫ్.ఐ. నాయకులు రాకేష్, తదితరులు పాల్గొన్నారు.










