వృద్ధులకు భోజన ప్యాకెట్లు అందిస్తున్న దృశ్యం
ప్రజాశక్తి -కందుకూరు : ఆకలికి అందరూ బంధువులే అనే నినాదంతో ఐ.ఎఫ్.సి ఫౌండేషన్ కందు కూరు వారి ఆధ్వర్యంలో సోమవారం పేదవారికోసం కందుకూరు ఊరిబయట నిస్సాయులైన వృద్ధులు, వికలాంగులను గుర్తించి వారికి భోజనాల ప్యాకెట్లు అందించారు. ప్రెసిడెంట్ సాజిద్, ట్రజరర్ హఫీజ్, ఇంచార్జ్ అయూబ్ ఖాన్ పఠాన్, నాని, షంషఉద్దీన్ పాల్గొన్నారు.










