Nov 21,2023 21:46

సీతంపేట : ఆడలిలో ప్రచారం చేస్తున్న పాలకొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జి జయకృష్ణ

ప్రజాశక్తి - సీతంపేట: మండలంలోని మర్రిపాడు పంచాయతీ పెద్దగూడలో భవిష్యత్తుకు గ్యారెంటీ, మహాశక్తి కార్యక్రమాన్ని టిడిపి నాయకులు పడాల భూదేవి ఆధ్వర్యాన నిర్వహించారు. టిడిపి మినీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. టిడిపిని గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి బిడ్డిక జయలక్మి, ఎంపిటిసి ప్రతినిధి బిడ్డిక చిలకమ్మ, సవర శరత్‌, సీనియర్‌ నాయకులు సవర మంగయ్య, బిడ్డిక రామకృష్ణ, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆడలిలో...
మండలంలో ఆడలిలో పాలకొండ నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ మండల టిడిపి అధ్యక్షులు సవర తోట మొఖలింగం ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి బాబు షూరిటీ -భవిష్యత్తు గ్యారంటీ '' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా జయకష్ణ మాట్లాడుతూ మినీ మేనిఫేస్టోలోని సూపర్‌ సిక్స్‌ అంశాలను వివరిస్తూ ఖచ్చితంగా చంద్రబాబునాయుడు మళ్లీ సిఎం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కార్యక్రమంలో సీతంపేట బిసి సెల్‌ అధ్యక్షులు ఆర్‌.రంగనాథం, క్లస్టర్‌ ఇంచార్జ్‌ నిమ్మక చంద్రశేఖర్‌, భవిష్యత్తు గ్యారెంటీ ప్రచారకర్త తోయిక సంధ్యారాణి, నిమ్మక గాసయ్య, నిమ్మక కర్రయ్య, ప్రసాద్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సాలూరు: బాబు స్యూరిటీ భవిష్యత్తుకి గ్యారెంటీ అన్న కార్యక్రమంలో భాగంగా మంగళవారం టిడిపి నాయకులు పట్టణంలోని 8వార్డు కొంకివీధిలో ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి సంధ్యారాణి ఆధ్వర్యాన నిర్వహించిన కార్యక్రమంలో టిడిపి అధికారంలోకి వస్తే పేదలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తామో తెలియజేసే కరపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
గుమ్మ లక్ష్మీపురం : ఏజెన్సీలో టిడిపికి అపూర్వ ఆదరణ వస్తుందని కురుపాం నియోజకవర్గ టిడిపి ఇంచార్జి తోయక జగదీశ్వరి అన్నారు. గుమ్మలక్ష్మీపురంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని మంగళవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టిడిపిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ పాడి సుదర్శన్‌ రావు, నాయకులు కడ్రక కళావతి, జానకి, సొంటేనే రాజేష్‌, చిన్నారావు, అడ్డాకుల నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.