Nov 14,2023 23:43

పాఠశాలను తనిఖీ చేసిన ఆర్‌జెడి

పాఠశాలను తనిఖీ చేసిన ఆర్‌జెడి
ప్రజాశక్తి -రామచంద్రపురం: మండలంలోని కుప్పం బాదూ రు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఆర్జెడి వెంకట కష్ణారెడ్డి మంగళ వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల వర్క్‌ బుక్సు, నోట్‌ బుక్‌ లను, ప్రగతిని పరిశీలించారు. ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్‌ (ఐఎఫ్బి) వినియోగం పై ఆరాతీశారు. మరుగుదొడ్ల గదులపై బాలురు బాలికలని బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. తరగతి గదులకు స్వాతంత్ర సమరయోధుల పేర్లు పెట్టాలని చెప్పారు. ఈ క్రమంలోనే ఉపాధ్యాయులతో సమావేశమై పలు సూచనలు చేశారు. అనంతరం కుప్పం బాదూరు ప్రాథమిక పాఠశాలను, అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఈవో శేఖర్‌, డివైఈవో ఆనంద రెడ్డి, ఎంఈఓలు మార్కొండయ్య నాయుడు, జయవేలు. ప్రధానో పాధ్యాయులు సుజనకుమారి, రాజేశ్వరి పాల్గొన్నారు.