పాఠశాల స్థలం కబ్జాపై చర్యలు తీసుకోవాలి తహశీల్దారుకు పాఠశాల విద్యాకమిటీ ఛైర్మన్ వినతి

పాఠశాల స్థలం కబ్జాపై చర్యలు తీసుకోవాలి
తహశీల్దారుకు
పాఠశాల విద్యాకమిటీ ఛైర్మన్ వినతి
ప్రజాశక్తి-బుచ్చినాయుడు కండ్రిగ: మండలంలోని నెలవాయి పాఠశాలకు విరాళంగా ఇచ్చిన భూమి కబ్జాకు గురైందని, కబ్జాకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్తు పాఠశాల విద్యా కమిటీ ఛైర్మన్ ఆధ్వర్యంలో తహశీల్దారు భార్గవికి మంగళవారం వినతిపత్రం అందిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో నినెలవాయి గ్రామ పంచాయతీకి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు గతంలో సర్వే నంబర్ 71/ బిలో ఆరెకరాల 43 సెంట్లు పాఠశాల భవనానికి విరాళంగా కొండేటి సుబ్బానాయుడు, వెంకటప్ప నాయుడు, రామానాయుడు, కష్ణమనాయుడు ఈ భూమిని పాఠశాల భవనానికి విరాళంగా అందించారన్నారు. ఈ భూమిలో ఎకరా 70 సెంట్లు పాఠశాల భవనం నిర్మించారు. మిగిలిన భూమిలో పాఠశాల నిర్మాణం పనులు కొనసా గుతున్నాయని, ఈ భూమిని 1976 జూన్ 14వ తేదీ సత్యవేడు రిజిస్ట్రేషన్ ఆఫీసులో పాఠశాల పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేశారు. ఈ భూమిలో 1976 నుండి ప్రాథమిక పాఠశాల నుండి జిల్లా పరిషత్ పాఠశాల వరకు దశల వారీగా పాఠశాల నిర్మాణం జరుగుతూనే ఉందని, ఈ భూమిలో ఒక ఎకరా 70 సెంట్లు పాఠశాల భవనానికి పోగా మిగిలిన భూమిని పిల్లల ఆట స్థలానికి ఉపయోగి స్తున్నార న్నారు. ఈ పాఠశాల భూమిలో కొందరు నెలవాయి గ్రామస్తు లు 2010వ సంవత్సరంలో ఈ భూమిని కబ్జా చేశారని పేర్కొన్నారు. అప్పటి గ్రామ సర్పంచి ఆర్ సుధా అప్పటి తహశీల్దారుకు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించిన తహశీల్దారు, అధికారులు గ్రామానికి పంపి ఆ కబ్జాదారుల నుండి అడ్డుకున్నారని తెలిపారు. తరువాత 2019వ సంవత్సరంలో ఆ పాఠశాల భూమిని అధికారులకు చేయి తడిపి ఆ భూమిని కబ్జా చేశారని ఈ భూమిని డి పుష్పమ్మ భర్త శివరామ నాయుడు పేరుపై ఆన్లైనులో ఎక్కించి పాసుబుక్ రూపొందించారన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని తహశీల్దారు భార్గవికి వినతి పత్రం అందించామని తెలిపారు. పాఠశాల భవనాన్ని కబ్జా చేసిన వారిని కఠినంగా శిక్షించి పాఠశాల భూమిని పాఠశాలకు ఇప్పించాలని గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్తు పాఠశాల విద్యా కమిటీ ఛైర్మన్ ధనుంజయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.