Nov 10,2023 19:51

ఆదోనిలో నిరసన తెలుపుతున్న నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ కాల్పులు ఆపి శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు వెంకటేశులు, రామాంజనేయులు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె.అజరు బాబు, సిపిఐ మండల కార్యదర్శి కల్లుబావి రాజు తెలిపారు. శుక్రవారం వామపక్షాల ఆధ్వర్యంలో నాయకులు సుదర్శన్‌, లింగన్న అధ్యక్షతన ఆదోని మున్సిపల్‌ మైదానం నుంచి ర్యాలీగా వెళ్లి భీమాస్‌ సర్కిల్‌ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గాజాలు మహిళలకు, చిన్న పిల్లలకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. పాలస్తీనాకు వామపక్షాలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయని అన్నారు. సిపిఎం జిల్లా నాయకులు ఈరన్న, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శులు కుమారస్వామి, విజరు, హర్షిత్‌, ఎఐటియుసి పట్టణ కార్యదర్శి బి.వెంకన్న, జిల్లా సహాయ కార్యదర్శి ఒబి.నాగరాజు, వైట్‌ భీమేష్‌ జిల్లా సమితి సభ్యులు షేక్షావలీ, సిపిఐ నాయకులు మెకానిక్‌ వలీ, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి దస్తగిరి, ఎఐవైఎఫ్‌ నాయకులు గిరి మల్లప్ప, సిపిఎం నాయకులు రామాంజి పాల్గొన్నారు. ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్‌లో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వామపక్ష నాయకులు గోవిందు, రంగన్న, రాముడు, ఏసోబు, అబ్దుల్లా, సిపిఐ నాయకులు రంగన్న, జబ్బార్‌, ఎంఎల్‌ పార్టీ నాయకులు మహేంద్ర పాల్గొన్నారు.

ఎమ్మిగనూరులో నిరసన తెలుపుతున్న నాయకులు
ఎమ్మిగనూరులో నిరసన తెలుపుతున్న నాయకులు
​​​​​