
ప్రజాశక్తి-కాకినాడ
భారత ప్రభుత్వం పాలస్తీనా ప్రజలకు అండగా నిలబడాలని కాకినాడ అఖిలపక్ష సమావేశం డిమాండ్ చేసింది. సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జి అధ్యక్షతన సిఐటియు కార్యాలయంలో ఈ సమవేశం నిర్వహించారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బోడకొండ, ఎఐటి యుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఐఎన్టియుసి ఎపి అండ్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరి రాజు, ఎఐసిసిటియు రాష్ట్ర కన్వీనర్ గొడుగు సత్యనారాయణ, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జల్లూరి వెంకటేశ్వరరావు, టిఎన్టి యుసి జిల్లా అధ్యక్షులు గదుల సాయిబాబు, ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి గుబ్బల ఆది నారాయణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమల శెట్టి నాగేశ్వరరావు, రైతు సంఘం నాయకులు పప్పు ఆదినారాయణ, పౌరసంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు, రాజ్యాధికారం పార్టీ జిల్లా నాయకులు రాయుడు మోజెస్ మాట్లాడుతూ మణిపూర్ మారణకాండలో బాధితుల తరుపున ఉద్యమించడంలో నేడు ఇజ్రాయెల్ యుద్ధంలో పాలస్తీనా ప్రజలపట్ల సంఘీభావాన్ని ప్రకటించడంలో కాకినాడ జిల్లా అఖిలపక్షం ఎల్లప్పుడూ బాధితుల పక్షాన నిలబడుతుందన్నారు. ఇజ్రాయిల్ నెతన్యహు ప్రభుత్వం ఓపెన్ ఎయిర్ జైలు వంటి గాజా ప్రాంత ప్రజానీకానికి మంచినీరు, విద్యుత్తు, ఆహార సరఫరా నిలిపివేసి అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ యుద్ధ నేరాలకు పాల్పడుతోందనివిమర్శించారు. ఐక్యరాజ్యసమితిలో 120 దేశాలు తక్షణం యుద్ధ విరమణ పాటించాలని తీర్మానం ప్రవేశపెడితే భారత ప్రభుత్వం గైర్హాజరు కావడం ద్వారా ద్వంద ప్రమా ణాలు మోడీ ప్రభుత్వం పాటిస్తుందన్నారు. ఇజ్రాయిల్ సష్టిస్తున్న మారణకాండలో ఇప్పటివరకు 4500 మంది పాలస్తీనా చిన్నారులు, 2500 మంది మహిళలు, వేలాదిమంది పౌరులు మరణిం చార న్నారు.1947లో ఐక్యరాజ్యసమితి చేసిన తీర్మానం మేరకు పాలస్తీనా ప్రత్యేక దేశం ఏర్పాటు చేయడమే ఈ సమస్యకు పరిష్కారమని సూచిం చారు. బాధితులైన పాలస్తీనా ప్రజలకు సంఘీ భావంగా 10న సాయంత్రం 6 గంటలకు అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహి ంచాలని నిర్ణయించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ కుమార్, పెద్దింశెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.