Nov 19,2023 22:24

ల్యాబ్‌ ను ప్రారంభించి పరిశీలిస్తున్న ట్రస్టు సభ్యులు

      పుట్టపర్తి అర్బన్‌ : సత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునికి కేదారైజేషన్‌ లేబరేటరీని సత్యసాయి మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జె.రత్నాకర్‌ ఆదివారం ప్రారంభించారు. ఆదివారం ప్రశాంతిగ్రామ్‌లోని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో రూ.4.2 కోట్లతో ఈ లేబరేటరీని నిర్మించారు. ఈ సందర్భంగా రత్నాకర్‌ మాట్లాడుతూ, కార్డియాలజీ విభాగంకు ఈ లేబరేటరీ అనుసంధానంగా ఉంటుందన్నారు. హదయ సంబంధ వ్యాధులను నిర్ధారించడానికి, చికిత్సలు అందించడానికి ఉపయోగ పడుతుందన్నారు. రోగ నిర్ధారణ చేయడం, గుండెకు సంబంధించిన వ్యాధులకు మెరుగైన చికిత్సలు అందించడానికి ల్యాబ్‌ ద్వారా సులభతరం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు చక్రవర్తి, నాగానంద, నిమీస్‌పాండే, ఆస్పత్రి డైరెక్టర్‌ గురుమూర్తి, డాక్టర్‌ విఆర్‌అయ్యర్‌, కార్డియాలజీ సిబ్బంది పాల్గొన్నారు.