Nov 08,2023 22:42

ప్రజాశక్తి-రాజోలు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు నూరు శాతం నెరవేర్చారని ఎంఎల్‌ఎ రాపాక వరప్రసాదరావు అన్నారు. బుధవారం సోంపల్లి గ్రామంలో రూ.21.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని, రూ.ఐదు లక్షలతో నిర్మించిన సిసి రోడ్డు, రూ.11.08 లక్షల నీటి సరఫరా పారిశుధ్య శాఖ నిధులతో నిర్మించిన డ్రైనేజ్‌ను ఎంఎల్‌ఎ రాపాక ప్రారంభించారు. అనంతరం గ్రామ సర్పంచ్‌ కట్టా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంఎల్‌ఎ రాపాక మాట్లాడుతూ మండల స్థాయిలో జరిగే కార్య్రమాలను ప్రజల సౌకర్యార్థం ముఖ్యమంత్రి జగన్‌ గ్రామ సచివాలయ వ్యవస్థను సృష్టించి గ్రామాల్లోనే ప్రజలకు సేవలందిస్తున్నారని అన్నారు. రైతు భరోసా కేంద్రాలు అందిస్తున్న సేవల వల్ల ప్రజల్లో వ్యవసాయంపై ఆసక్తి పెరిగిందని అన్నారు. రెవెన్యూ, వ్యవసాయ, ఆరోగ్య సేవలు గ్రామాల్లోనే ప్రజలకు అందుతున్నాయని అన్నారు. మార్కెట్‌ కమిటీ చైర్పర్షన్‌ గుబ్బల రోజా రమణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ హయాంలో వ్యవసాయం పండగలా మారిందన్నారు. జెడ్‌పిటిసి మట్టా శైలజ, కొంబత్తుల బాలయోగి, తిరుమాని రాజు, బొమ్మిడి వెంకటేష్‌, చొల్లంగి సింహాద్రి, కట్టా సత్యనారాయణ, రాజోలు, శివకోటి సర్పంచులు రేవు జ్యోతి, నక్కా రామారావు, రాజోలు ఎఎంసి ఛైర్మన్‌ కూనపురెడ్డి రాంబాబు పాల్గొన్నారు.