Nov 09,2023 22:15

ప్రజాశక్తి-యంత్రాంగం
మోసపూరిత జాబ్‌ క్యాలెండర్‌ తో నిరుద్యోగులను సిఎం జగన్‌ దగా చేస్తున్నారని తెలుగు యువత విమర్శించారు. నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న జగన్‌ వైఖరిపై తెలుగు యువత ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు.
కాకినాడ మోస పూర్తి వాగ్దానాలతో మాయమాటలతో యువతను నమ్మబలికి అధికారంలోకి వచ్చిన జగన్‌ మోసపూరిత జాబ్‌ క్యాలెండర్‌ తో నిరుద్యోగులను దగా చేస్తున్నాడని కాకినాడ సిటీ నియోజకవర్గ తెలుగు యువత విమర్శించారు. జగన్‌ నిరంకుశ వైఖరికి నిరసనగా కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో బుధవారం నగర తెలుగు యువత ఇంద్రపాలెం అంబేద్కర్‌ కూడలి నందు అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లులు అర్పించారు. అనంతరం నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా ప్రొఫెషనల్‌ వింగ్‌ అధ్యక్షులు వనమాడి మోహన వర్మ, తెలుగు యువత అధ్యక్షులు చింతలపూడి రవి మాట్లాడుతూ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాల కాలంగా మోస పూర్తి జాబు కాలండర్‌ తో కాలం వెల్లదీస్తున్నాడన్నారు. రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శులు గాది శివ రామకష్ణ, తేజ్‌ యాదవ్‌, తెలుగు యువత నాయకులు కసింకోట చంద్రశేఖర్‌, పిన్నమ్మరెడ్డి బుజ్జి, పాలిక సూర్య, కర్రీ నరసింహా మూర్తి, తదితరులు పాల్గొన్నారు. రౌతులపూడి నిరుద్యోగుల కు ఉద్యోగాలు కల్పించకుండా సిఎం జగన్‌ మోసపూరిత జాబ్‌ కేలండర్‌ తో కాలం గడిపారని నాయకులు విమర్శించారు గురువారం రౌతులపూడిలో నిరసన తెలియజేశారు. ప్రతి సంవత్సరం డిఎస్‌సి నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి నేటికి భర్తీ చేయలేదన్నారు.రాష్ట్రంలో పరిశ్రమలు వేరే రాష్ట్రానికి తరలిపోవడం నూతనంగా రాష్ట్రానికి పరిశ్రమల పెద్దగా రాకపోవడం వంటి పరిస్థితులతో రాష్ట్రంలో నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు పైల వేణు. గవిరెడ్డి గుర్నాథ్‌. కొరుప్రోలు ధనకేశవరావు వాసు తదితరులు ఉన్నారు. తాళ్ళరేవు రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం మోసపూరిత నోటిఫికేషన్‌ లు, జాబ్‌ క్యాలెండర్‌ లు ప్రకటించి నిరుద్యోగులను మోసం చేస్తుందని రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వహక కార్యదర్శి ధూళిపూడి వెంకటరమణ ఆధ్వర్యంలో తాళ్ళరేవు లో గురువారం తహశీల్దార్‌ కార్యాలయం సమీపంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడు కాకర్లపూడి రాజేష్‌ మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో మోసపోయిన యువతతో మండల స్థాయిలో ఆందోళన చేసామని, 11న పార్లమెంటు స్థాయిలో తరువాత రాష్ట్ర స్థాయిలో ధర్నాలు చేస్తామన్నారు. ఎస్‌సి సెల్‌ నాయకుడు జక్కల ప్రసాద్‌ బాబు, యువకులు ప్రవీణ్‌, అఖిల్‌, అనిల్‌, రమణ, శివభాస్కర్‌, సందీప్‌, గౌతం, నానిబాబు తదితరులు పాల్గొన్నారు.