ఫొటో : పనులు పరిశీలిస్తున్న ఎంఇఒ షావుద్దీన్
నాడు-నేడు పనులు పరిశీలన
ప్రజాశక్తి-వరికుంటపాడు : మండలంలోని తూర్పురొంపిదొడ్ల గ్రామంలోని జెడ్పి ఉన్నత పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను బుధవారం ఎంఇఒ షేక్ షావుద్దీన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పని ప్రదేశాన్ని పరిశీలించి నాణ్యత తరచూ పర్యవేక్షణ చేస్తూ త్వరితగతిన పనులు పూర్తి అయ్యేలా చూడాలని హెడ్మాస్టర్కు సూచించారు. రూ.42లక్షలతో జరుగుతున్న ఈ పనులను పాఠశాల ప్రారంభం లోపు పూర్తి చేయాలన్నారు.










