Jul 26,2021 17:59

ఇంఫాల్‌ : టోక్యో ఒలింపిక్స్‌లో రజతపతకం సాధించిన మీరాబాయి చానును అదనపు పోలీస్‌ సూపరింటెండెంట్‌ (క్రీడలు) నియమించనున్నట్లు మణిపూర్‌ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. రూ.కోటి రివార్డుతో పాటు అదనపు పోలీస్‌ సూపరింటెండెంట్‌గా నియమించనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.బీరేన్‌ సింగ్‌ తెలిపారు. అలాగే ఒలింపిక్స్‌లో పాల్గన్న మరో అథ్లెట్‌ లిక్మాబమ్‌ సుశీలా దేవికి రూ. 25 లక్షల రివార్డుతో పాటు కానిస్టేబుల్‌ పదవి నుండి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి కల్పించనున్నట్లు వెల్లడించారు. కాగా, మీరాబాయి చాను టోక్యో నుండి సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. మణిపూర్‌ విమానాశ్రయ సిబ్బందితో పాటు పలువురు అభిమానులు స్వాగతించారు.