Nov 15,2023 21:31

కిడ్నీ శస్త్ర చికిత్స చేసిన పేషంట్‌తో యాజమాన్యం

'మనోహరి'లో కిడ్నీ క్యాన్సర్‌కు అరుదైన శస్త్ర చికిత్స
ప్రజాశక్తి -తిరుపతి సిటీ తిరుపతిలోని మనోహరీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో కిడ్నీ క్యాన్సర్‌ కు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించినట్లు ప్రముఖ న్యూరాలజిస్ట్‌ వైద్యులు డాక్టర్‌ హర్ష తెలిపారు. స్థానిక రెడ్డి రెడ్డి కాలనీ లోని ఆ ఆసుపత్రి వద్ద ఆయన 'ప్రజాశక్తి'తో మాట్లాడుతూ 25 సంవత్సరాల వయసు గల యువతకు కిడ్నీ క్యాన్సర్‌ కు పూర్తిగా లాప్రోస్కోపీ ద్వారా చికిత్స అందించడం జరిగిందన్నారు. ఇలాంటి అరుదైన శస్త్ర చికిత్స తిరుపతి మహానగరంలో ఇదే మొట్టమొదటిది అని వెల్లడించారు. ఎలాంటి కోతలు లేకుండా కేవలం లాప్రోస్కోపీ ద్వారా చికిత్స అందించడం ద్వారా రోగి కేవలం మూడు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారన్నారు. ప్రస్తుతం రోగి పూర్తి ఆరోగ్యంతో ఉన్నారన్నారు. తమ ఆసుపత్రుల్లో లాప్రోస్కోపీ ద్వారా కిడ్నీ సంబంధిత వ్యాధులకు, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక పద్ధతుల వైద్యం అందిస్తున్నామన్నారు.
కిడ్నీ శస్త్ర చికిత్స చేసిన పేషంట్‌తో యాజమాన్యం