Jul 27,2021 12:43

ఉజ్జయిని : మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్‌ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో పలువురు మహిళలు, పిల్లలు గాయపడ్డారు. భక్తులు తెలిపిన సమాచారం మేరకు.. శ్రావణమాసం తొలి సోమవారం నాడు.. ఆలయంలోని మహేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు వచ్చారు. అయితే అదే సమయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతితోపాటు పలువురు ఎంపీలు కూడా ఆలయ సందర్శనకు వచ్చారు. ఆ సమయంలో ఆలయానికి సంబందించిన నాల్గవ గేటు వద్ద తొక్కిసలాట జరిగింది. అయితే ఈ తొక్కిసలాటలో భక్తులే కాదు.. పలువురు పోలీసులు గాయపడినా.. పెద్ద ప్రమాదమేమీ జరగకపోవడం విశేషం.