నారా లోకేష్ను సత్కరిస్తున్న గోచిపాతల మోషే
ప్రజాశక్తి -కందుకూరు :టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు చేపట్టిన యువగళం పాదయాత్రలో భాగంగా 2వ రోజు కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలో జరుగుతున్న పాదయాత్రలో టిడిపి నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి గోచిపాతల మోషే పాల్గొని మద్దతు తెలిపి శాలువాతో సత్కరించారు. మోషేతో పాటుగా బద్దిపూడి గ్రామ టిడిపి అధ్యక్షులు తాటిపర్తి జాన్ వెస్లీ, కందుకూరు నియోజకవర్గం ఎస్సి సెల్ కార్యదర్శులు కసుకుర్తి నవరత్నం, గౌడపేరు ప్రసాద్ రావు, గౌడపేరు అనిల్, తాతపూడి జాఘవా ఉన్నారు.










