Jul 28,2021 13:13

నల్లజర్ల (పశ్చిమ గోదావరి) : ఓ యువకుడిని కిడ్నాప్‌ చేసి రూ.50 లక్షలు డిమాండ్‌ చేశారు. ఇంతలోనే ఆ యువకుడిని చంపేశారు. ఈ ఘటన బుధవారం నల్లజర్ల మండలం పోతవరంలో కలకలం రేపింది. నీట్‌ విద్యార్థి కొనకళ్ల వంశీ (23) ని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్‌ చేశారు. యువకుడి తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి రూ.50 లక్షలు డిమాండ్‌ చేశారు. దీంతో యువకుడి తల్లితండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఇంతలోనే.. ఆ యువకుడిని హత్య చేశారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.