Nov 13,2023 22:43

క్యాన్సర్‌ బాధితురాలికి చేయూత

క్యాన్సర్‌ బాధితురాలికి చేయూత
ప్రజాశక్తి - గూడూరు రూరల్‌: ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్య ర్యంలో ఆదివారం గూడూ రు మండల పరిధిలోని విందూర్‌ గ్రామం లోని గిరిజన కాలనీ లో పావని అను మహిళకు క్యాన్సర్‌ వ్యాధితో బాధ పడుతోంది. పావనికి మానవతా సాయంగా రిటైర్డ్‌ విద్యుత్‌ ఉద్యోగి వర్మ 5వేలు , సంస్థ తరపున 5 వేలు రూపాయలను అందచేశారు. అనంతరం ఫల సరు కులను అందచేశారు. కుటుంబ సభ్యులకు దుస్తులు అందచేశారు. ఈ సందర్భంగా దాతల సహకారంతో సంస్ధ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడు తున్నామన్నారు. దాతల సేవలు మరువలేనివి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ ఉపాధ్యక్షులు బండి ధనంజయ రెడ్డి, అబ్దుల్లా, అరుణ్‌ కుమార్‌, అంగన్‌వాడీ టీచర్‌ రాజేశ్వరీ, కార్యవర్గ సభ్యులు వాకాటి రామ్మోహన్‌ రావు, ప్రజేంద్రరెడ్డి, ఐటిఐ ప్రభాకర్‌, పిడికరి ముళ్ళా, శ్రీ చైతన్య స్కూల్‌ ప్రిన్సిపల్‌ శ్రీనివాసులు, గ్రానైట్‌ ప్రభాకర్‌, వాచ్‌ షాప్‌ రాము, శివకుమార్‌ రెడ్డి(శివాని స్టడీ సర్కిల్‌), రాధయ్య, కుమార్‌ నాయుడు పాల్గొన్నారు.