May 05,2021 13:42

ప్రజాశక్తి-కశింకోట (విశాఖ) : కశింకోట మండలంలో కర్ఫ్యూ కట్టుదిట్టంగా సాగుతోంది. ఎస్‌ఐ సురేష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం నుండి దుకాణాలను మూసివేశారు. రోడ్లు పై ప్రజలు తిరగకూడదని సూచించారు. తాళ్ళపాలెం జంక్షన్‌ లో ప్రత్యేక నిఘాను ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గస్తీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.