బెంగళూరు : 23వ కర్ణాటక ముఖ్యమంత్రిగా బవసరాజ్ బొమ్మై ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ బుధవారం ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముందు మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పతో కలిసి బసవరాజ్ రాజ్భవన్కు చేరుకున్నారు. అంతకముందు తనకు సిఎం పదవి వచ్చేందుకు కారకులైన యడియూరప్ప కాళ్లకు నమస్కారం చేసి ఆశ్వీరాదాలు తీసుకున్నారు. అదేవిధంగా ప్రమాణ స్వీకారం అనంతరం క్యాబినేట్ సమావేశం నిర్వహిస్తానని చెప్పారు. కోవిడ్-19, రాష్ట్రంలోని వరద పరిస్థితులను సమీక్షించేందుకు సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహిస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి యడియూరప్ప వారసుడిగా బసవరాజు బొమ్మైను మంగళవారం జరిగిన శాసన సభా సక్ష సమావేశంలో ఆమోదం తెలుపుగా..అధిష్టానం ఖరారు చేసింది. ఇదే సమయంలో ముగ్గురు ఉప ముఖ్యమంత్రులను నియమించారు. ఆర్ .అశోక్, బి. శ్రీరాములు, గోవింద కారజోళ ఈ పదవులకు ఎంపికయ్యారు.