Jan 03,2021 12:18

విశాఖపట్నం : పెంచిన కొత్త పన్నుల విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 6న జివిఎంసి వద్ద నిరసన తెలపాలని సిపిఎం జగదాంబ జోన్‌ కమిటీ నిర్ణయించుకుంది. నిరసన కార్యక్రమ విజయవంతానికి ప్రచార నిమిత్తం ఈ రోజు అల్లిపురములో సిపిఎం నాయకులు సుబ్బారావు అధ్యక్షతన పాదయాత్ర చేసి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వై.రాజు మాట్లాడుతూ.. పట్టణ సంస్కరణలలో భాగంగా ప్రజలపై విపరీతమైన పన్నుల భారం వేయటం, గృహ విస్తీర్ణంపై కాకుండా మార్కెట్‌ ధరపై పన్ను వేయటం దారుణం అని, మురికి నీటిపై పన్ను వేయటం సభ్య సమాజానికి సిగ్గు చేటు అని అన్నారు. దీనిని వ్యతిరేకించటం ప్రజల భాధ్యత అని, ఈ నెల 6న జివిఎంసి వద్ద నిర్వహిచ తలపెట్టిన ధర్నాలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు చంద్రమౌళి, గోవింద్‌, శ్రీను, రాము, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.