Nov 13,2023 22:47

కార్మికుల సంక్షేమానికి కృషి వైసిపి నాయకులు శివశంకర రాజు

కార్మికుల సంక్షేమానికి కృషి
వైసిపి నాయకులు శివశంకర రాజు
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): కార్మికుల సంక్షేమానికి వైసిపి కట్టుబడి పనిచేస్తుందని మంగళం పరిధిలోని తిరు మల నగర్‌ గ్రామ పంచాయతీ వైసిపి బాధ్యులు గుండ్రాజు శివ శంకరరాజు అన్నారు. దీపావళిని పుర స్కరించు కుని పంచాయతీలో పని చేస్తున్న పారిశుద్ధ కార్మికులకు, పంపు ఆపరే టర్లు, సిబ్బందికి టెంకాయ నూనె, సోపులు, యూనిఫామ్‌ క్లాత్‌, టపాకాయలను వితరణ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ వకుళ మాట్లాడుతూ పంచాయతీలోని హ్యాబి టేషన్స్‌ను ఎంతో శుభ్రంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులకు వ్యక్తిగత శుభ్రత కోసం ఈ వస్తువులను ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గుండ్రాజు లక్ష్మీదేవి, ఉప సర్పంచి తిరుమల ప్రసాద్‌ బాబు, పంచాయతీ కార్యదర్శి రాజేష్‌, వైసిపి పంచాయతీ అధ్యక్షులు రమేష్‌, వార్డు మెంబర్లు రాము, రమేష్‌, నాగేంద్ర, మోహన్‌, వైసిపి నాయ కులు ఏవిఎం శ్రీనివాసులు, రమణ, శ్రావణ్‌, సంతోష్‌, దయాకర్‌ పాల్గొన్నారు.