
కాలువలో వ్యర్థాలు వేస్తే కఠిన చర్యలు
ఇరిగేషన్ శాఖ
అధికారుల హెచ్చరిక
ప్రజాశక్తి -కోట : కోట మండలంలోని కోట క్రాస్ రోడ్డు విద్యానగర్ మధ్యలో చల్ల కాలువలో ఎవరైనా కాలువలో వ్యర్థ పదార్థాలను పడేస్తే తక్షణమే సంబంధిత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇరిగేషన్ శాఖ అధికారులు మాట్లాడుతూ ఈ కాలువ ద్వారా పెన్నక్క చెరువుకు నీటి పారుదల ఉంటుందని గుర్తు చేశారు. ఈ నీటి పారుదల ద్వారా ఎంతో మంది రైతులు పంట పొలాలకు ఉపయోగించుకుంటున్నారని గుర్తు చేస్తూ ఇలాంటి సందర్భాల్లో వ్యర్థ పదార్థాలు నీటిలో కలుషితమై అనేక రకాలుగా రైతులకు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా కోట మండలంలోని ప్రజలందరూ గమనించి ఎలాంటి వ్యర్థ పదార్థాలను కాలువ లో పడేయ కుండా చూ డా లన్నారు. ఒకవేళ విరుద్ధంగా ఎవరైనా పెద్ద వ్యర్థ పదార్థా లను కాలువ లో పడేస్తే తక్షణమే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసు కుంటామని ఇరిగేషన్ అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశామని ఆయా శాఖ అధి కారులు ఏ ఈ మునికష్ణ, వర్క్ ఇన్స్పెక్ట్టర్ అబ్దుల్లా తెలిపారు.