ప్రజాశక్తి- దేవనకొండ
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఆదర్శంగా నిలిపినందుకే మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని జిల్లా జెసిఎస్ అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, దేవరగట్టు ఆలయ ఛైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసులు, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు శాంతి కుమార్ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని 2వ సచివాలయంలో జడ్పిటిసి రామకృష్ణ, మండల కన్వీనర్ కప్పట్రాళ్ల మల్లికార్జున ఆధ్వర్యంలో 'సిఎం జగనే ఎందుకు కావాలి' నిర్వహించారు. ముందుగా సచివాలయం పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. సచివాలయ ఆవరణలో ప్రత్యేక సమావేశం నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. అనంతరం బస్టాండ్ సమీపంలోని వైఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి, వైసిపి జెండాను ఆవిష్కరించారు. అనంతరం బిల్డింగ్ కాలనీలో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. ఎంపిడిఒ గౌరీదేవి, పంచాయతీ సెక్రటరీ అబ్దుల్ రహిం, వైసిపి నాయకులు ప్రభాకర్ రెడ్డి, నిజాలు రెడ్డి, నారాయణరెడ్డి, ప్రేమ్ నాథ్ రెడ్డి, మదన్ మోహన్ రెడ్డి, తెర్నేకల్ సర్పంచి అరుణ్ కుమార్, పల్లెదొడ్డి చంద్ర, యూసుఫ్ బాష, కందనాతి రంగన్న, నీలి రాజశేఖర్ పాల్గొన్నారు.
సంక్షేమ బోర్డును ఆవిష్కరిస్తున్న వైసిపి నాయకులు