Nov 09,2023 20:50

గోడపత్రికను విడుదల చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
పూర్తి స్థాయి జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి యువతను ఆదుకోవాలని తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్‌ చౌదరి డిమాండ్‌ చేశారు. గురువారం ఆదోనిలోని కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను ఆదుకోవాల్సిన బాధ్యత వైసిపి ప్రభుత్వంపై ఉందన్నారు. నిరుద్యోగ భృతి రద్దు చేసి యువతకు అన్యాయం చేశారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాలు లక్షల్లో ఖాళీలు ఉంటే కేవలం వందల్లో భర్తీ చేయడం తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని, లేకపోతే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. తెలుగు యువత పట్టణ అధ్యక్షులు రవి, మండల అధ్యక్షులు వీరేంద్ర, ప్రతాప్‌ రెడ్డి, మల్లికార్జున, వినరు, సుబ్బు, చాగీ మల్లికార్జున రెడ్డి, ఢణాపురం రఘు, ఖాసీం, నవీన్‌, గురు పాల్గొన్నారు.