Apr 01,2023 19:50

పుష్పగుచ్చం అందజేస్తున్న కలెక్టర్‌

పుష్పగుచ్చం అందజేస్తున్న కలెక్టర్‌
ఏపి హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్‌
నెల్లూరు:ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.వి.శేషసాయిని కలెక్టర్‌ కెవిఎన్‌ చక్రధర్‌బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం నగరంలో నిర్వహించనున్న ఇండియన్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ కాన్ఫరెన్స్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి ఆయన చేరుకున్నారు.
ఈ నేపద్యంలో నగరంలోని మినర్వా గ్రాండ్‌ ఓ ప్రైవేటు హౌటల్‌ లో బసచేసిన హైకోర్టు న్యాయమూర్తిని కలెక్టర్‌ చక్రధర్‌ బాబు , జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.