Jan 18,2022 13:40

విజయవాడ : ఈ నెల 21 వ తేదీన విజయవాడలో అలంకార్‌ థియేటర్‌ వద్ద ఉన్న ధర్నా చౌక్‌ వద్ద చేపట్టనున్న మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి జన్నా శివశంకర్‌ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక కొల్లూరులోని ప్రజాసంఘాల కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రైతులందరూ ఈ మహాధర్నాలో పాల్గని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం సహాయ కార్యదర్శి కాజా వెంకటేశ్వర రావు, మండల నాయకులు పాల్గొన్నారు.